హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'హామీ ఇచ్చి.. నిధులు మంజూరు చేసిన చంద్రబాబు'

KRNL: ఆస్పరి సంజీవని గ్రామసభలో ఇచ్చిన హామీ మేరకు సాగునీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయడం పట్ల ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రూ.1,942.80 కోట్ల సాగునీటి పనులకు అనుమతులు మంజూరు చేయడం శుభదాయకమన్నారు.