హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూ సమస్యల పరిష్కారానికై సభకు తరలిరండి'

MDCL: 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న నివాసితులు, తమ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ఉదయం 11 గంటలకు మల్లికార్జున నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ గ్రౌండ్‌లో నిర్వహించే సభకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని గౌతమ్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సభకు MLA మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ఆమె తెలిపారు.