హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాథమిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలి: ట్రైనీ కలెక్టర్

NZB: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ట్రైనీ కలెక్టర్ సురేష్ పామూరి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని, టీకాలు 100 శాతం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టీబీ, క్యాన్సర్, హెచ్‌ఐవీ, డెంగీ నివారణపై విస్తృత ప్రచారం చేపట్టాలని, మాతా-శిశు మరణాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.