హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు రాష్ట్రానికి రానున్న ఉపరాష్ట్రపతి

AP: భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ ఏలూరు జిల్లాకు రానున్నారు. సీఎం చంద్రబాబు ఉపరాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. ఉదయం 11 గంటలకు కాట్రేనిపాడులో గౌర్మెట్ పాప్‌కార్నికా ఫ్యాక్టరీకి రాధాకృష్ణన్ రానున్నారు. నూతన పాప్‌కార్న్ విత్తనాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. అనంతరం రైతులను సన్మానిస్తారు. తర్వాత గన్నవరం చేరుకొని ఢిల్లీకి తిరిగి వెళ్తారు.