హైదరాబాద్: 28°C
వార్తలు

తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం

డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. లోక్‌సభ సీట్లు యథాతథంగా ఉంచాలని సీఎం విజయ్ తీర్మానం ప్రవేశపెట్టారు. లోక్‌సభ స్థానాలను 543గానే ఉంచాలని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ సభలో తీర్మానించారు. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టవద్దని సీఎం విజయ్ సూచించారు.