హైదరాబాద్: 28°C
వార్తలు

మత్స్యకారులు మరణిస్తే రూ.5లక్షలు

VKB: మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మత్స్యకారులు మరణిస్తే రూ. 5లక్షల ప్రమాద బీమాను అందించేందుకు కృషి చేస్తుంది. వికారాబాద్ జిల్లాలో 152 మత్స్య సహకార సంఘాలు ఉండగా.. అందులో 5,640 మంది సభ్యులు ఉన్నారు. మత్స్యకారులు తమ పేర్లను సంఘాల్లో నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.