హైదరాబాద్: 28°C
వార్తలు

'భారతీయులు ఇరాన్ వీడాలి'

అమెరికా, ఇరాన్ సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం.. భారతీయులెవరూ ఇరాన్‌కు వెళ్లవద్దని సూచించింది. ఇప్పటికే అక్కడ నివసిస్తున్న వారు వెంటనే దేశం విడిచి రావాలని తెలిపింది. అనివార్యంగా అక్కడే ఉండిపోయే వారు సైనిక స్థావరాలకు దూరంగా, అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.