హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు పార్లమెంట్‌ ముట్టడికి పిలుపు

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఈరోజు పార్లమెంట్‌ ముట్టడికి పిలుపునిచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో CJP ఈ నిరసన ర్యాలీని తలపెట్టింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ పరిసరాల్లో పోలీసులు BNS సెక్షన్ 163 (గతంలో 144 సెక్షన్) విధించారు. సెంట్రల్ ఢిల్లీలో అదనపు బలగాలను మోహరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.