TG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు 'వరుణ యాగం' నిర్వహించనున్నారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, కరవు పరిస్థితులు తొలగి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఈ యాగాన్ని చేపట్టారు.
వార్తలు
నేటి నుంచి వరుణ యాగం


