ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అసోంలో పర్యటిస్తున్నారు.

రూ.14,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేస్తున్నారు.

అసోం అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ ఇనిస్టిట్యూట్ కు పునాది వేస్తున్నారు.

గౌహతి హైకోర్టు ప్లాటినమ్ జుబ్లీ సెలబ్రేషన్స్ లో పాల్గొంటారు.

ఆ తర్వాత అసోంలో కలర్ ఫుల్ గా సాగే బిహు ఉత్సవంలో పాల్గొంటున్నారు.

10,000 మందికి పైగా బిహు డ్యాన్సర్లు ప్రదర్శించే కార్యక్రమాన్ని చూస్తారు.

శుక్రవారం రోజునే ఇక్కడ రొంగలి బిహు వేడుకలు జరుపుకుంటున్నారు.

ప్రతి నెల బోహాగ్ (మిడ్ ఏప్రిల్) ప్రారంభ వారంలో దీనిని నిర్వహిస్తారు.

జనవరిలో భోగాలి లేదా మాగ్ బిహు, ఏప్రిల్ లో బోహాగ్ లేదా రొంగలి బిహు, అక్టోబర్ లో కొంగలి బిహు జరుపుకుంటారు.

అసోంలో జరుపుకునే ప్రధాన పండుగ బోహాగ్ బిహు. ఈ రోజు కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ పవిత్రమైన రోజున ప్రజలు కోత సీజన్ ప్రారంభాన్ని జరుపుకుంటారు. ఇది హిందూ సౌర క్యాలెండర్ యొక్క మొదటి రోజు కూడా.