రాగుల్లో ఎన్నో పోషకాలున్నాయి.

రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి.

రాగులతో చేసిన దోసెలను తింటుంటే కొవ్వు కరిగిపోతుంటుంది.

రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు.

రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు.

రాగులలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి కనుక శరీర బరువును నియంత్రిస్తాయి.

మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి దోసెలను తీసుకోవడం ఎంతో మంచిది.

రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక ఒత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి.

ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు రాగి దోసెలను తింటుంటే తక్షణ శక్తి వస్తుంది.