అంబులెన్స్ ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేసి మళ్లీ ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేశారు. తెలంగాణ కళాకారుడికి ప్రభుత్వం అండగా ఉంటదని మంత్రి తన ప్రతినిధుల ద్వారా మొగిలయ్య, కొమురమ్మలకు తెలిపారు. మీకు మేమున్నాం అనే భరోసా ఇచ్చారు. మంత్రి హరీశ్ రావు స్పందనపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.
ఇది జరిగిన కొన్ని నెలల్లోనే మళ్లీ డ్రోన్ కెమెరా చిత్రీకరణ చేయడం వివాదం రాజేస్తోంది. వాస్తవంగా ఏదైనా ప్రముఖ ఆలయంపై నుంచి చిత్రీకరణ చేయవద్దు. హిందూ శాస్త్రం (Hindu) ప్రకారం ఆలయ గోపురంపై ఎలాంటి విహంగాలు సంచరించవద్దు.
షెట్కారీ సంఘటన్ కలిసి పని చేయడానికి ముందుకు రావడం కేసీఆర్ కు మరింత బలం ఇవ్వనుంది. మరి వీరి లేఖకు కేసీఆర్ స్పందిస్తారో లేదో చూడాలి. అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో వీళ్లు కలిసి వస్తామని చెప్పడంతో కేసీఆర్ వారిని స్వాగతించే అవకాశం ఉంది. త్వరలోనే ప్రగతి భవన్ కు షెట్కారీ సంఘటన్ ప్రతినిధులు రానున్నారు.
శ్రీరామ నవమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం గం.12 సమయానికి త్రేతాయుగంలో జన్మించాడు.
రెండు, మూడు సభల్లో కేసీఆర్ కుమారస్వామితో కలిసి ప్రచారం చేస్తారని కర్ణాటకలో ప్రచారం కొనసాగుతున్నది. ఇక తెలంగాణకు సరిహద్దున ఉన్న కన్నడ జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రచారం చేయనున్నారు. కాకపోతే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో (KU) ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంఘర్షణ సభకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు వీసీ కార్యాలయం ముట్టడించేందుకు బయలు దేరారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా.. తప్పించుకుని వీసీ ఆఫీస్(VC Office) బిల్డింకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలు చేశారు. ఈ క్రమంలోనే స్టూడెంట్స్, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
తెలుగుదేశం పార్టీ (TDP) 41వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ (Hyderabad)లో నిర్వహించిన కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన టీడీపీ 41వ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు మాట్లాడుతూ దేశానికి దశ, దిశ చూపిన వ్యక్తి పీవీ నరసింహారావు అని, పీవీ సంస్కరణల ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారు.
తెలంగాణలోని (Telangana) ప్రభుత్వం, ప్రవేట్ స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరుకు ప్రభుత్వం వేసవి సెలవులు (summer holidays) ప్రకటించింది. 2023-24 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం అవుతుందని విద్యాశాఖ(Department of Education) తెలిపింది. అయితే ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు SA – II ఎగ్జామ్స్ ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
Bandi Sanjay : తనకు కేటీఆర్ నోటీసులు పంపడం పై బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. నోటీసులను తాను లీగల్గానే ఎదుర్కొంటానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
దక్షిణాది అయోధ్యగా పేరొందిన భద్రాచలం (Bhadrachalam) పుణ్యక్షేత్రంలో రాములోరి కళ్యాణాన్నికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 30, గురువారం శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్భంగా సీత,రామ కల్యాణం నిర్వహిస్తారు. కల్యాణం వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scan) ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను (MLC KAVITHA) మరోసారి విచారించాలని ఈడీ భావిస్తోంది. విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే మూడు సార్లు విచారణ జరిపిన ఈడీ మరోసారి కొన్ని విషయాలపై క్లారిటీ కోసం ప్రయత్నిస్తోంది. విచారణలో భాగంగా కవిత వద్ద ఉన్న ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
Traffic Rules : దేశవ్యాప్తంగా రేపు శ్రీరామనవమి పండగను జరుపుకోనున్నారు. రేపు అన్ని రామాలయాల్లో శ్రీరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ క్రమంలోనే నగరంలో రేపు రాముని శోభయాత్ర నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.