SRD: పటాన్చెరు నియోజకవర్గం గడ్డపోతారం మున్సిపల్ కేంద్రంలో మాజీ సర్పంచ్ ప్రకాష్ చారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి MLA మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.