NZB: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచార సమయాల్లో నిబంధనలు పాటించాలని ధర్పల్లి తహశీల్దార్ శాంత మంగళవారం సూచించారు. అభ్యర్థులు తమ ప్రచార వాహనాలకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మైకును ఉపయోగించుకోవచ్చన్నారు. అయితే, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మైకు లేకుండా ప్రచారం చేసుకోవచ్చని తెలిపారు.