KMR: నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచి స్థానం జనరల్ వర్గానికి కేటాయించారు. గ్రామస్థులంతా కలిసి కేతవత్ లక్ష్మీభాయ్ను ఏకగ్రీవంగా మంగళవారం ఎన్నుకున్నట్లు తీర్మానించారు. ఏకగ్రీవంగా తీర్మానించినందుకు లక్ష్మీభాయ్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. నిస్వార్థంగా సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు.