ADB: భోరజ్ మండలంలోని నిరాల గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ ఇంఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.