JGL: ఇటీవల గ్రూప్-1లో ఎంపికైన కన్నం హరిణి, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ను సోమవారం తన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లికి చెందిన ఆమె, డిప్యూటీ కలెక్టర్ హోదాలో శిక్షణ కోసం జగిత్యాల జిల్లాకు నియమితులై, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్గా విధుల్లో చేరారు.