KMR: బీర్కూర్ మండలంలోని బైరాపూర్లో గురువారం ఉచిత గాలికుంటు నివారణ టీకా కార్యక్రమం నిర్వహించారు. పశువైద్యాధికారి మారుతి మాట్లాడుతూ.. పశువులు రోగాల బారిన పడకుండా ముందస్తుగా టీకాలు వేయాలని పాడి రైతులకు సూచించారు. మొత్తం 308 పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుధారాణి, గోపాలమిత్ర నాగార్జున, రైతులు పాల్గొన్నారు.