MDK: చిన్నశంకరంపేట ప్రాథమిక సహకార సంఘం కార్యాలయాన్ని వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీ ప్రవీణ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఎరువులు కొన్న ప్రతి రైతుకు తప్పకుండా రసీదులు ఇవ్వాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. ఈ తనిఖీలో సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి పాల్గొన్నారు.