BDK: చుంచుపల్లి మండలం పెనగడపలో ఇవాళ BRS నాయకులు అచ్చా నరేందర్ కార్యకర్తతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీలో వర్గ విభేదాలు పార్టీ భవిష్యత్కు మంచివి కావని అన్నారు. కొత్తగూడెం ఇన్ఛార్జ్ వనమా వెంకటేశ్వరరావును సంప్రదించకుండా మండల కమిటీలు వేయడంపై ఆయన ప్రశ్నించారు. ఏకాభిప్రాయ నిర్ణయాలు సరికాదని, పార్టీకి నష్టం జరగకుండా చూడాలని సూచించారు.