MDK: రామాయంపేట మండల కేంద్రంలోని అమోఘ రెస్టారెంట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశాడు. దర్జాగా వచ్చిన ఒక యువకుడు రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే ద్విచక్ర వాహనాన్ని తీసుకొని పారిపోయాడు. బైక్ యజమాని ఫిర్యాదుతో సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.