BHPL: మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే రేగొండ, గణపురం, గోరికొత్తపల్లి, మొగుళ్లపల్లి మండలాల్లో మంగళవారం ఉదయం 5 గంటల నుంచి గురువారం ఫలితాల ప్రక్రియ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల మేరకు బ్రాందీ షాపులు మూసివేస్తారు. ఎన్నికలు సజావుగా జరిగేలా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.