KMM: కూసుమంచి మండలంలోని మంగళ్తండాకు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు బానోత్ మంగ్య నాయక్, ధర్మతండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ధరావత్ రామోజీ నాయక్ అనారోగ్యంతో ఇవాళ మృతి చెందారు. వారి మరణం పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. పార్టీ తరపున వీరి కుటుంబానికి అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు.