KMM: ఖమ్మం కార్పొరేషన్ 1వ డివిజన్ విద్యానగర్ కాలనీలో రూ. 4 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. గత రెండేళ్లలో విద్యానగర్ అభివృద్ధికి రూ.12 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. డ్రైన్ల పనులను పూర్తి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు.