JN: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు అన్నారు. రామచందర్ రావును స్టేట్ కౌన్సిల్ మెంబర్ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, నేతలు కలిశారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కాసేపు రాష్ట్ర అధ్యక్షుడితో నేతలు క్షుణ్ణంగా చర్చించారు.