KMM: నామినేషన్ల స్వీకరణ సక్రమంగా జరిగేలా అధికారులు అవసరమైన మార్గదర్శకాలు పాటించాలని సహాయ ఎన్నికల అధికారి, ఎంపీడీవో ఎర్రయ్య సూచించారు. నేలకొండపల్లి మండలంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల కేంద్రాలను వారు నేడు పరిశీలించారు. చెరువు మాదారం, నాచేపల్లి, బోదులబండ, మండ్రాజ్ పల్లి గ్రామాల్లోని కేంద్రాలలో ఏర్పాట్లను సమీక్షించారు.