MDK: నిజాంపేట మండలం నూతన గ్రామ పంచాయతీ షౌకత్పల్లిలో సర్పంచ్, ఉపసర్పంచ్తో పాటు ఆరుగురు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవ తీర్మానం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు. నూతన పాలకవర్గం ఇదే స్ఫూర్తితో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది.