WNP: పెబ్బేరు మండలంలోని సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, కూడళ్ల అభివృద్ధికి మున్సిపల్ నిధుల నుంచి రూ. 15 కోట్లు మంజూరు చేసినట్లు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి తెలిపారు. జీవో నెంబర్ 254 ప్రకారం నిధులను విడుదలకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పెబ్బేరు మండలం రూపు రేఖలు మారిపోతున్నట్లు ఆయన తెలిపారు.