ADB: భీంపూర్ మండలంలోని పిట్టలకోటి గ్రామంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం పర్యటించారు. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కేమ గంగయ్య తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనిల్ జాదవ్ వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.