PDPL: రామగుండంలో మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ ఇవాళ పర్యటిస్తారని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఈ సందర్భంగా వారు వివిధ డివిజన్లలో రూ. 80.52 కోట్ల అభివృద్ధి పనులు, UIDF నిధులతో చేపట్టనున్న 88.90 కోట్ల విలువైన నీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణ పనులు, R&B ఆధ్వర్యంలో రూ. 6.5 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని అన్నారు.