HYD: నగరంలో నమోదైన సైబర్ కేసుల్లో చిత్ర విచిత్రమైన మోసాలు వెలుగు చూశాయి. కేవలం రూ. 2 వేలకే ఐఫోన్ ప్రకటనను నమ్మి ఓ విద్యార్థి రూ. 2.50 లక్షలు కోల్పోయాడు. పందెం కోళ్ల కొనుగోలు పేరుతో మరో వ్యక్తి రూ. 1.54 లక్షలు మోసపోయాడు. ఆన్లైన్లో అవకాడో పండు బుక్ చేసుకున్న వ్యక్తి, ప్రమాదం సాకుతో రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు.