MBNR: పాలమూరు యూనివర్సిటీ పురుషుల వాలీబాల్ జట్టు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలలో పాల్గొనడానికి సోమవారం కాకినాడకు బయలుదేరింది. డిసెంబర్ 10 నుంచి 14 వరకు జేఎన్టీయూ కాకినాడలో ఈ పోటీలు జరగనున్నాయి. ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి, క్రీడా దుస్తులు అందజేశారు. శ్రీనివాసులు, కోచ్ వెంకటేష్ పాల్గొన్నారు.