వరంగల్ కొంగు బంగారమైన శ్రీ భద్రకాళి ఆలయంలో ఆదివారం ఉదయం అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి విశేషమైన అలంకరణ చేశారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. నేడు సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.