MBNR: క్షేత్రస్థాయిలో బలపడితేనే పార్టీకి బలమని మహబూబ్నగర్ జిల్లా ఎంపీ డీకే అరుణ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొడంగల్ మండలంలోని అన్నారం గ్రామంలో ప్రారంభించారు. గ్రామాల్లో కార్యకర్తలు ఎక్కువగా ఉన్నప్పుడే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీకి పట్టు వస్తుందని ఆమె అన్నారు.