కోల్కతా ఈడెన్స్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ టాస్ ఓడింది. దీంతో పర్యాటక జట్టు కెప్టెన్ టెంబా బవుమా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా 2010 నాగ్పూర్ టెస్టులో విజయం సాధించిన SA ఆ తర్వాత భారత గడ్డపై వరుసగా ఓడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది.