• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఖమ్మం ఆర్టీసీ డిపోలో సమస్యలు పరిష్కరించండి’

KMM: ఖమ్మం ఆర్టీసీ డిపోలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఖమ్మం కమిటీ ఆధ్వర్యంలో డిపో మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రీజియన్ ప్రచార కార్యదర్శి తోకల బాబు మాట్లాడుతూ.. సమస్యలను పరిశీలించి త్వరలో డిపో పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

October 18, 2025 / 08:44 PM IST

బాలుడికి అండగా ఎమ్మెల్యే

KNR: చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన బాలుడు స్వాద్విన్‌ను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శనివారం పరామర్శించి, రూ. 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ప్రభుత్వ సహాయం వెంటనే అందేలా చూడాలని కోరారు. భవిష్యత్తులో బాలుడికి అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు

October 18, 2025 / 08:43 PM IST

సీసీ కెమెరాల ఏర్పాటుకు భారీ విరాళం

VKB; పరిగి మండలం పెద్దమాదారంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎల్కిచర్ల రమేశ్ ముందుకొచ్చారు. పరిగి SI మోహన్ కృష్ణను కలిసి రూ.1,01,000 విరాళంగా శనివారం అందజేశారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు అవసరమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని SI అన్నారు.

October 18, 2025 / 08:43 PM IST

కోదాడ మాస్టర్ ప్లాన్‌పై స్టేక్‌హోల్డర్స్ సమావేశం

SRPT: అమృత్ 2.0 పథకానికి కోదాడ ఎంపికైందన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు శనివారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవర్ అధ్యక్షతన తొలి స్టేక్‌హోల్డర్ సమావేశం జరిగింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ, విద్య వంటి రంగాలపై సమగ్ర ప్రణాళిక అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు.

October 18, 2025 / 08:42 PM IST

‘దండుపాళ్యం పాలన ఎవరిదో తెలుసు’

TG: దండుపాళ్యం పాలన ఎవరిదో ప్రజలకు తెలుసని, అధికారం లేదనే అసహనంతో BRS నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్గత కుమ్ములాటలు కప్పిపుచ్చుకోవడానికే మైండ్‌గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మంత్రులది ఒకటే అజెండా అని, గత 20 నెలల్లో రాష్ట్రానికి రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు.

October 18, 2025 / 08:40 PM IST

పిల్లిని కాపాడటం కోసం పెద్ద సాహసమే చేశారు..!

HYD: దీపావళి పండుగ సందర్భంగా టపాసుల శబ్దాలకు భయపడిన ఓ పిల్లి సికింద్రాబాద్ పరిధిలో బావిలో పడింది. బయటకు రాలేకపోవటానికి గమనించిన స్థానికులు అనిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ బృందాలకు సమాచారం అందించారు. పిల్లిని రక్షించడం కోసం లోతైన బావిలోకి దిగి, పెద్ద సాహసమే చేశారు. పిల్లిని రక్షించడం పట్ల స్థానికులు హర్ష వ్యక్తం చేశారు.

October 18, 2025 / 08:40 PM IST

JVVసమావేశం విజయవంతం చేయండి: లక్ష్మీనారాయణ

SRCL: వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం జన విజ్ఞాన వేదిక జిల్లా వార్షిక సమావేశం నిర్వహిస్తున్నట్లు జెవీవీ జిల్లా జనరల్ సెక్రటరి పారం లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించడానికి గత 37 ఏళ్లుగా జనవిజ్ఞాన వేదిక అనేక చైతన్యవంతమైన కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

October 18, 2025 / 08:39 PM IST

హైస్కూల్లో మొక్కలు నాటిన సెక్రటరీ

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడుతూ స్వచ్ఛమైన గాలి కోసం కృషిచేయాలని సర్పంచ్ అడాలసూరిబాబు,సెక్రెటరీ ఎం సత్యనారాయణ విద్యార్థులకు వివరించి, హైస్కూల్లో మొక్కలు నాటారు.హెచ్ఎం రామరాజు,సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

October 18, 2025 / 08:39 PM IST

నాంపల్లి కోర్టుకు హాజరైన భువనగిరి ఎమ్మెల్యే

BHNG: భువనగిరి MLA కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ శనివారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో రాజ్ భవన్ ముట్టడి సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు. త్వరలోనే తనపై ఉన్న ఈ కేసులను కోర్టు కొట్టివేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

October 18, 2025 / 08:39 PM IST

వ్యక్తికి గాయాలు ఆసుపత్రికి తరలింపు

ELR:  వంగాయిగూడెం మద్యం దుకాణం సమీపంలో ఓ వ్యక్తి రోడ్డు పక్కనే పడి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులు తెలపడంతో.. ఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ ఇంఛార్జ్ ఎస్సై దుర్గాప్రసాద్ పరిశీలించి మద్యం మత్తులో రోడ్డుపై పడటంతో అతని తలకు గాయమై రక్తం కారిందని స్పష్టం చేశారు. అతనికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్య సహాయం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నామని తెలియజేశారు.

October 18, 2025 / 08:37 PM IST

గ్రీవెన్స్ బందోబస్తును స్వయంగా పరిశీలించిన ఎస్పీ

GNTR: మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరైన సందర్భంగా ఏర్పాటు చేసిన బందోబస్తును జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు. గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరయ్యే వీవీఐపీ, వీఐపీ మరియు ప్రజలు రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని పోలీస్ సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు.

October 18, 2025 / 08:35 PM IST

‘గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా’

VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి శనివారం సారిపల్లి గ్రామంలో ప్రజలతో మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. ఈమేరకు ఆమె గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి వారి బాగోగులు విచారించారు. అనంతరం అక్కడ నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పీఏఎఫ్‌ ప్యాకేజీ, రహదారి, ఉపాధి పనుల కొరత సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.

October 18, 2025 / 08:34 PM IST

‘సూపర్ సేవింగ్స్ పై అవగాహన కల్పించాలి’

AKP: జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ జాహ్నవి, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సూచించారు. శనివారం సాయంత్రం అనకాపల్లిలో షాపింగ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాజాగా వస్తువుల ధరలు తగ్గడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందన్నారు. ధరలు తగ్గడం చిన్న వ్యాపారులు వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందన్నారు.

October 18, 2025 / 08:32 PM IST

దర్గాను సందర్శించిన ఎమ్మెల్యే

krnl: హొలగుంద మండలం ఎల్లార్తి గ్రామంలోని ప్రసిద్ధ షేక్షావలి దర్గాను ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి శనివారం సందర్శించారు. దర్గాకు చేరుకున్న ఆయనకు పూజారులు, స్థానిక ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ప్రాంత ప్రజల అభ్యున్నతి, సకల శ్రేయస్సు కోసం దువా చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

October 18, 2025 / 08:31 PM IST

కాంగ్రెస్ నాయకుని కుటుంబీకులను పరామర్శించిన ప్రభుత్వ విప్

SRCL: వేములవాడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంకణాల శ్రీనివాస్ స్మారక ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

October 18, 2025 / 08:31 PM IST