AP: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ‘ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించాం. నవంబర్లో రూ.105 కోట్లు చెల్లిస్తాం. జనవరిలో మరో రూ.105 కోట్లు ఇస్తాం. చైల్డ్ కేర్ లీవ్స్ ఎప్పుడైనా వాడుకోవచ్చు’ అంటూ పేర్కొన్నారు.
TG: రాష్ట్రంలో ‘బీసీ బంద్’ విజయవంతమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. విద్యా, వ్యాపార సంస్థలు పూర్తిగా బంద్కు మద్దతు తెలిపాయన్నారు. బీసీ బంద్కు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ డిమాండ్పై న్యాయ వ్యవస్థలు దిగివస్తాయని నమ్ముతున్నామని ఆయన స్పష్టం చేశారు.
ADB: ఉట్నూర్ మండలం గొట్టిగోండగూడ గ్రామానికి చెందిన అనసూయకు శనివారం పురిటి నొప్పులు రావడంతో 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బిడ్డకు జన్మనిచ్చినట్లు ఈఎంటీ అజ్మీరా ప్రవీణ్ కుమార్ తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని ఆస్పత్రికి చేర్చినట్లు పైలట్ రాజేందర్ తెలిపారు.
KNR: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (DCCB)లో 43 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీఈఓ సత్యనారాయణ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 18 నుంచి నవంబర్ 6 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాత పరీక్ష డిసెంబర్లో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు, నిబంధనల కోసం అభ్యర్థులు బ్యాంకు వెబ్ సైట్ను సందర్శించాలన్నారు.
HYD: అమృత్ భారత్ స్టేషన్స్ పథకంలో భాగంగా కొనసాగుతున్న వివిధ రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులపై సికింద్రాబాద్ రైల్వే నిలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి సంబంధించి జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, DRN డాక్టర్ రామకృష్ణ తదితరులు వివరించారు. పునరాభివృద్ధి మరో ఏడాదిలో పూర్తికానుంది.
SKLM: సారవకోట మండలంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం పర్యటించారు. ఈ మేరకు నౌతల కూడలిలో చిన్నారులు చేస్తున్న స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కేంద్ర మంత్రి దృష్టిని ఆకర్షించింది. వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా చిన్నారులు ర్యాలీ చేపట్టడం కేంద్ర మంత్రిని ఆలోచింపజేసింది. ఈ నేపథ్యంలో తన కాన్వాయ్ను ఆపి చిన్నారులతో ముచ్చటించారు.
TG: మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ను రూపొందించిన రెండు యూట్యూబ్ ఛానెళ్లపై HYD సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ ఛానెళ్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. SMలో స్వేచ్ఛ ఉందని, ఏ తరహా కంటెంట్ అయినా చేస్తామంటే కుదరదని HYD సీపీ సజ్జనార్ హెచ్చరించారు. చట్ట ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.
NLG: నల్గొండ బాలికల జూనియర్ కళాశాల NSS విద్యార్థులు, స్టాఫ్ నర్సింగభట్ల గ్రామానికి చేరుకొని హై స్కూల్ ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించే శ్రమదానం నిర్వహించారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చెన్నుగూడెం సర్పంచ్ శ్రీలత జంగయ్య యాదవ్ ప్రారంభించి, విద్యార్థులకు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుధారాణి, NSS అధికారులు పాల్గొన్నారు.
PDPL: ధర్మారం మండలంలో పెన్షన్ ఇప్పిస్తానంటూ వృద్ధురాలిని మోసం చేసి, 2 తులాల బంగారు గొలుసు దొంగిలించిన అల్లెపు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ జిల్లాల్లో ఇతనిపై 96 కేసులు ఉన్నాయని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. నవీన్ మెడికల్ ఏజెన్సీ వద్ద నిందితుడిని పట్టుకొని, బంగారు గొలుసుతో పాటు రూ.30 వేలు నగదును రికవరీ చేసినట్లు చెప్పారు.
KMR: పిట్లం ఎంపీడీవో కార్యాలయంలో శనివారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాల ప్రస్తుత స్థితిని, లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం పనుల్లో వేగం పెంచాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవడానికి ముందుకు రాని వారి స్థానంలో అర్హులైన ఇతరులను ఎంపిక చేయాలని ఆమె ఆదేశించారు.
NLG: మర్రిగూడ కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో రూ. 1.50 కోట్ల రూపాయలతో పూర్తిచేసిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఆదివారం జరగనుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఈ పనులను చేపట్టారు. ఛైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి, ఎమ్మెల్యేతో పాటు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్లో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా 225 పోస్టులను భర్తీ చేయనున్నారు. NOV-6తో ఆన్ లైన్ దరఖాస్తు గడువు ముగుస్తుంది. ఈ పరీక్షను DECలో నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
BDK:పెండింగ్లో ఉన్న కేసుల వివరాల గురించి ఎస్సై రమాదేవిని డీఎస్పీ అబ్దుల్ రహమాన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం సుజాతనగర్ పోలీస్ స్టేషన్ను కొత్తగూడెం డీఎస్పీ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులను, పరిసరాలను పరిశీలించారు. అలాగే పోలీస్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. వారితో సీఐ వెంకటేశ్వర్లు, సీసీ బాబురావు ఉన్నారు.
PDPL: దీపావళి సందర్భంగా పటాకుల వినియోగం వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రజలు ప్రభుత్వం, టీజీపీసీబీ మార్గదర్శకాలను పాటించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే పటాకులు కాల్చాలని, పాఠశాలలు, ఆసుపత్రుల సమీపంలో వాడకూడదని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో బాధ్యతగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.