కేంద్ర ప్రభుత్వం తమ నడ్డి విరుస్తోందని ప్రజలు వాపోతున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తమపై గుదిబండ మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ల సేవలో మునిగి తేలుతున్న మోదీ ప్రజలపై మాత్రం మోయలేని భారం మోపుతున్నారని విమర్శిస్తున్నాయి. బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంటున్నాయి.
పరారీలో ఉన్న స్వయంప్రకటిత గాడ్-మ్యాన్ నిత్యానంద కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసకు (United States of KAILASA) చెందిన ప్రతినిధులు జెనీవాలో స్థిర అభివృద్ధిపై చర్చ సందర్భంగా పాల్గొన్నట్లుగా వార్తలు వచ్చాయి.
గుంటూరు జిల్లాలో రైతు భరోసా పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నీ అబద్దాలు చెప్పారని, అసలు వాస్తవాలను దాచి, తామేదో చేసినట్లు చెప్పుకుంటున్నారని తెలుగు దేశం పార్టీ విమర్శలు గుప్పించింది.
ఓ కార్యక్రమంలో భాగంగా ఓ వ్యక్తి చేసిన నెక్ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. ఈ వీడియోను ఓ డాక్టర్ నెట్టింట పోస్ట్ చేయగా..ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది.
స్టార్ హీరో రామ్ చరణ్, తన భార్య ఉపాసన కామినేని వారి బిడ్డకు అమెరికాలో జన్మనివ్వబోతున్నట్లు వచ్చిన పుకార్లపై ఉపాసన క్లారిటీ ఇచ్చింది. అవన్నీ నిజాలు కాదని ఇండియాలోనే తాను చిన్నారికి జన్మనివ్వనున్నట్లు స్పష్టం చేసింది.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) తమ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. తనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయకుంటే తాను వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని తేల్చి చెప్పారు. తనకు ఇతర పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ఉద్దేశం లేదన్నారు. అయితే తనకు బీజేపీ నాయకత్వం తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు.
తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్స్ తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మరోవైపు గ్రూప్ 4 ఉద్యోగాల్లో అనేక జిల్లాలలో తమకు పోస్టులను కేటాయించడంలో అన్యాయం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు.
భాగ్యనగరంలో ఇటీవల కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు ప్రదీప్ వార్త సంచలనంగా మారింది. అయితే ఈ బాలుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తాజాగా జీహెచ్ఎంసీ ప్రకటించింది. వీటిలో కార్పొరేటర్ల నెల జీతం నుంచి రూ.2 లక్షలు, మిగతావి జీహెచ్ఎంసీ నుంచి ఇస్తామని వెల్లడించింది.
సైఫ్ (saif) రూపంలో ర్యాగింగ్ భూతానికి బలైన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) విద్యార్థిని ప్రీతి నాయక్ వేధింపుల పర్వం గురించి కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ (Kakatiya Medical College) మోహన్ దాస్ స్పందించారు.
kodandaram:తెలంగాణ వాదం మరింత బలంగా వినిపించింది మిలియన్ మార్చ్ (million march). మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచింది. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మార్చి 10వ తేదీన తెలంగాణ బచావో (telangana bachao) సదస్సు నిర్వహిస్తామని తెలంగాణ జన సమితి అధ్యక్షులు, ప్రొపెసర్ కోదండరామ్ (kodandaram) తెలిపారు. సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్ను (wall poster) ఆయన ఆవిష్కరించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వారి రాజీనామాలను ఆమోదించారు.
Goutham Gambhir : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల ఆయనను ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఈ విషయంపై గంభీర్ స్పందించారు.
సైఫ్ (saif) అనే ఉన్మాది ఘాతుకానికి బలైన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) విద్యార్థిని ప్రీతి నాయక్ (Preethi Nayak) తల్లిదండ్రులకు భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాం, మెసేజింగ్ యాప్ స్నాప్చాట్ ప్రయోగాత్మకంగా My AI చాట్బాట్ ఫీచర్ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇంకోవైపు ఇప్పటికే మెటా సంస్థతోపాటు జూమ్ కంపెనీ కూడా ఈ టెక్నాలజీని వారి సంస్థల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.