పార్టీ సింబల్ విషయంలో తమకు ఏం జరిగిందో అన్ని పార్టీలు చుసాయని, ఇప్పటికైనా బీజేపీతో కలవాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచింది అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గం అసలైన శివసేన గా గుర్తించిన ఎన్నికల కమిషన్ ఆ వర్గానికి పార్టీ సింబల్ విల్లు - బాణం గుర్తును కేటాయించింది
తమిళనాడులోని మహాబలిపురం (Mahabalipuram) సమీపంలోని పత్తిపులం గ్రామంలో నిర్వహించిన మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై (Tamilisai) హాజరయ్యారు. ఆమె నడుస్తూ వేదిక వైపు వస్తూ ఉండగా…. కార్పెట్ మీద ఒక్కసారిగా జారి కిందపడ్డారు.
సామాజిక మాధ్యమాలు ఇలా వసూళ్ల దందాకు తెరలేపాయి. ప్రజలను సామాజిక మాధ్యమాలను వినియోగించుకునేలా అలవాటు చేసిన సంస్థలు ఇప్పుడు అదే ప్రజలను పీల్చుకు తినేలా చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లేనిది ప్రజలు ఉండలేకపోతున్నారు. సోషల్ మీడియా మాయలో పడి తమ జీవనశైలినే ప్రజలు మార్చుకున్నారు. గంటల కొద్దీ సామాజిక మాధ్యమాల్లో ఉంటూ వృత్తి, వ్యక్తిగత పనులపై శ్రద్ధ కనబర్చలేకపోతున్నారు. ఒక వ్యసనంలా సోషల్ మీడియా విని...
ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఉండవు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 151A ప్రకారం, ఎన్నికల సంఘం కంటోన్మెంట్(Cantonment) కు ఉప ఎన్నిక నిర్వహించదు. ఈ చట్టం ప్రకారం జి. సాయన్నకు ఎమ్మెల్యేగా ఏడాది పదవీ కాలం లేదు కాబట్టి సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేదు.
తారకరత్న అకాల మరణం నందమూరి కుటుంబంలో, చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నిన్న హైదరాబాద్ లోని తారకరత్న నివాసానికి వెళ్లి నివాళి అర్పించారు. ఆయన పార్థివదేహాన్ని చూసి బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ సహా పలువురు భావోద్వేగానికి గురయ్యారు. తారకరత్న అంత్యక్రియలు నేడు సాయంత్రం (సోమవారం, 20 ఫిబ్రవరి) మహాప్రస్థానంలో జరగనున్నాయి
ప్రభుత్వ ఉద్యోగులకు కేరళ (kerala) సర్కారు షాకిచ్చింది. ఇకపై వారు ఎలాంటి యూట్యూబ్ (youtube) చానళ్లు నిర్వహించారాదని ఆర్డర్ (orders) జారీ చేసింది. ఉద్యోగులు అలా చేయడం ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందంటు రీసెంట్ గా రిలిజ్ చేసిన జోవోలో తెలిపింది.
శివసేన (shiv Sena) పార్టీలోని ఉద్ధవ్ థాక్రే గ్రూప్ కు (Uddhav Thackeray) చెందిన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్(Sanjay Raut)ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీ గుర్తు కోసం 2000 కోట్లు చేతులు మారాయని తీవ్ర ఆరోపణలు చేశారు.
నందమూరి కుటుంబ సభ్యుడు, నటుడు తారకరత్న మృతి పైన వైసీపీ నేత నందమూరి లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇన్నాళ్లు ఆయన మృతిని దాచి పెట్టారు అని సంచలన ఆరోపణ చేశారు.
నందమూరి తారకరత్న చివరి ప్రసంగం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గత నెల 27వా తేదీన తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చారు తారకరత్న. ఆ సమయంలో అస్వస్థత ఏర్పడి హాస్పిటల్ కు తరలించారు. విషమంగా ఉండడంతో అక్కడి నుండి బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ 23 రోజుల చికిత్స అనంతరం ఆయన కన్నుమూశారు. అయితే ఆయన చివరి ప్రసంగం ఇప్పుడు వైరల్ గా మారింది. మన...
నటుడు తారకరత్న నటుడిగా అంతగా నిలబడలేక పోయినప్పటికీ ఆయన కొన్ని పాటలు మాత్రం ఎందరినో అలరించాయి. ముఖ్యంగా నెంబర్ వన్ కుర్రాడు సినిమాలోని నువు చూడూ చూడకపో అనే పాట బాగా క్లిక్ అయింది.
తెలంగాణలోని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్ 2,170 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అందులో 2,100 ఎకరాలు కబ్జా చేశారని వైఎస్సార్సీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇలాంటి కబ్జా అంశంపై ఏ పార్టీ నేతలు కూడా ప్రశ్నించలేదని..కానీ తాను అడిగినందుకు దాడులు చేయిస్తున్నారని పేర్కొన్నారు.
సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ 6 వికెట్లతో సౌరాష్ట్రను ఆదివారం బెంగాల్పై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించడానికి మార్గనిర్దేశం చేశాడు. దీంతో నాల్గవ రోజున మూడు సీజన్లలో రెండో టైటిల్ ను బెంగాల్ పై విజయం సాధించి గెలుపొందారు. ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్లో రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర గెలుపొందింది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ శనివారం(ఫిబ్రవరి 18న) విడుదల కాగా...తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 2.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు.
హైదరాబాద్ అంబర్ పేట పోలీస్ స్టేషన్ గ్రౌండ్ దగ్గర ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థులు నిరసన చేపట్టారు. హైకోర్టు ఆదేశం ప్రకారం మ్యాన్యువల్ గా హైట్ చెక్ చేయకుండా మళ్లీ డిజిటల్ మీటరే ఉపయోగించి తమను డిస్ క్వాలిఫై చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. మరోవైపు లాంగ్ జంప్, షాట్ పుట్ కూడా ఎక్కువగా పెట్టి తమకు డిస్ క్వాలిఫై చేశారని ఇంకొంత మంది వాపోయారు.