TG: రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ ముగిసింది. వివిధ దేశాల నుంచి ప్రతినిధులు, కంపెనీల సీఈవోలు ఈ సమ్మిట్కు హాజరయ్యారు. రెండ్రోజుల్లో రూ. 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. 2047 వరకు తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా.. విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించారు.