జామపండును ఖాళీ కడుపుతో తింటే దాని ఫైబర్, సహజ ఎంజైములు పేగులను శుభ్రం చేస్తాయి. పేగు కదలికను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఉదయం క్రమం తప్పకుండా జామపండు తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. రోగ నిరోధకశక్తిని బలపరుస్తుంది. జలుబు, ఫ్లూ, అలసట వంటి కాలానుగుణ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.