TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. రేపటి నుంచి చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణశాఖ తెలిపింది. కాగా, ఆసిఫాబాద్లో ఈ ఉదయం 8.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. తర్వాత ఆదిలాబాద్లో 10.2డిగ్రీలు, నిర్మల్లో 11.7డిగ్రీలు, సంగారెడ్డిలో 12డిగ్రీలు, మెదక్లో 13డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.