TG: కొత్త గవర్నర్గా నియమితులైన శివప్రతాప్ శుక్లా తొలిసారి రాష్ట్రానికి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో గవర్నర్ దంపతులకు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. సీఎం అక్కడే మర్యదపూర్వకంగా గవర్నర్తో భేటీ అయ్యారు. రేపు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ చేతుల మీదుగా కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.