AP: రాష్ట్రంలో టెన్త్ పరీక్ష ఫీజు గడువు ఇవాళ్టితో ముగియనుంది. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం అక్టోబర్ 28వ తేదీ ఆఖరు కాగా.. అధికారులు ఆ గడువును ఇవాళ్టి వరకు పొడిగించారు. ఈ రోజు చెల్లించని వారు రూ.50 అపరాధ రుసుముతో ఈ నెల 12వ తేదీ వరకు, రూ.200 అపరాధ రుసుముతో 15 వరకు, రూ.500తో 18వ తేదీ వరకు చెల్లించుకోవచ్చు.