TG: ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంలో ఫిష్ కర్రీ, ఇతర ఆహార పదార్థాలను వండిపెట్టేలా చూస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. త్వరలోనే అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతానని పేర్కొన్నారు. అటు రాష్ట్రంలో 26 వేల నీటి వనరుల్లో చేపపిల్లలను వదిలిపెడతామన్నారు. వీటిలో 84 కోట్ల చేపపిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను రిలీజ్ చేస్తామని చెప్పారు.