AP: మాజీ సీఎం జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. ఐదేళ్ల జగన్ పాలనలో చేసిందేమీ లేదని విమర్శించారు. రాయలసీమకు హంద్రీనీవా జీవనాడి వంటిదని అన్నారు. వైసీపీ హయాంలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే హంద్రీనీవాకు రూ.3,860 కోట్లు వెచ్చించినట్లు మంత్రి నిమ్మల వెల్లడించారు.