AP: శ్రీశైలం టోల్గేట్ వద్ద రివాల్వర్ కలకలం రేపుతోంది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టగా.. ఓ వ్యక్తి నుంచి 9MM పిస్టల్ బయటపడింది. దీంతో పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకుని విచారించారు. రివాల్వర్ తీసుకొచ్చిన వ్యక్తి మధ్యప్రదేశ్ వాసిగా గుర్తించారు. ఆ రాష్ట్రానికి చెందిన సైబర్ క్రైమ్ ఎస్ఐ అని ఆయన పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.