AP: తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి సర్వదర్శనం కోసం 12 గంటల సమయం పడుతుండగా.. 22 కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల వేంకటేశ్వరుడిని 67,367 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 22,369 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ద్వారా 4.30 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ తెలిపింది.