NLR: కావలి మండలం రాజువారి చింతలపాలెం శివారులో ఫోన్ దొంగతనం అనుమానంతో టిఫిన్ సెంటర్ యజమాని రమేష్పై సూర్య అనే యువకుడు శుక్రవారం కత్తితో దాడి చేసినట్లు కావలి రూరల్ ఎస్సై బాజీబాబు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రమేష్ నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.