దీపావళి రోజు తండ్రీకొడుకులు టపాసులకు బదులు తుపాకీలను కాల్చటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఢిల్లీలోని శాస్త్రీనగర్కు చెందిన ముకేశ్, అతని తండ్రి పండుగ రోజున తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ దృశ్యాలను ఫోన్లో రికార్డు చేసి ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ కావడంతో వీరిద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.